News September 7, 2024
నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.
Similar News
News December 25, 2025
తిరుమలలో నెల్లూరు జిల్లా కలెక్టర్… జిల్లా ప్రధాన న్యాయమూర్తి

తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం సందర్భంగా అనుకోకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ కలుసుకున్నాను. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేలా స్వామివారి కృప కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
News December 25, 2025
ఉదయగిరి: హనీఫ్ మాస్టర్ ఇక లేరు..!

ఉదయగిరికి చెందిన ‘ఉర్దూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్’ గ్రహీత షేక్ మహమ్మద్ హనీఫ్ ఖాలిది(77) ఇక లేరు. బుధవారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన జీవితాంతం ఉర్దూ భాష అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆయన ఎంతో శ్రమించి రచించిన “ఉదయగిరి మహనీయులు” పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో మృతి చెందడం బాధాకరం.
News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


