News May 31, 2024

నెల్లూరు: భారీగా దొరికిన బంగారం, డబ్బు

image

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రూ.కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. చెన్నై బస్సులో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా ఐదుగురు మహిళల వద్ద రూ.1.61 కోట్లు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తున్న కారులో రూ.కోటి విలువైన 1497 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికాయి. మరోవైపు వెంకటాచలం టోల్‌గేట్ వద్ద 1.65 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు.

Similar News

News December 15, 2025

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్

image

నెల్లూరు నగర మేయర్‌గా స్రవంతి చేసిన రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్‌ను ఎన్నుకునే దాకా.. కార్పొరేషన్‌లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్‌ఛార్జ్ మేయర్‌గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News December 15, 2025

బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

image

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.

News December 15, 2025

నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

image

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్‌ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.