News September 19, 2024
నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మునుస్వామి తెలిపారు.
Similar News
News September 29, 2024
నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.
News September 29, 2024
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.
News September 28, 2024
వేదాయపాలెం రైల్వే స్టేషన్లో వృద్ధురాలు
నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.