News May 8, 2024

నెల్లూరు: భార్యపై భర్త కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బుతుకు తెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి మదనపల్లె పరిధిలోని నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.

Similar News

News October 23, 2025

VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.

News October 23, 2025

ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News October 23, 2025

ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

image

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.