News March 22, 2025
నెల్లూరు: మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల ఆనం తీవ్ర విచారం

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సతీమణి షహనాజ్, మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Similar News
News March 24, 2025
ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుందంటూ MLC చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. 17 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించడంపై ఆధారాలు ఇచ్చినా మంత్రి లోకేశ్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రూ.5,252కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజలు TDPని గెలిపించి బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News March 23, 2025
కూటమి ప్రభుత్వం జగన్పై విష ప్రచారం చేస్తుంది: పర్వత రెడ్డి

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విషపూరితమైన ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాడు నేడు ద్వారా జగన్ 45 వేల పాఠశాలలను ఆధునీకరణ చేశారన్నారు. అలాంటి జగన్ను.. మంత్రి నారా లోకేశ్ పాఠశాలలను నిర్వీర్యం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు
News March 23, 2025
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.