News April 20, 2024
నెల్లూరు: మహిళ స్పాట్డెడ్

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 13, 2026
నెల్లూరులో సిటీ బస్సులు.. ట్విస్ట్ ఇదే!

నెల్లూరులో <<19612409>>సిటీ బస్సులు <<>>తిప్పుతామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వీటికంటూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే బస్సులకే టౌన్ స్టాఫింగ్ ఇచ్చారు. వాటిపై పల్లెటూరి పేర్లు ఉండటంతో టౌన్ బస్సులని చాలామందికి తెలియడం లేదు. వీటిని ఎవరూ ఆపడం లేదు. ప్రత్యేక బస్సులు వేయడం లేదా పల్లెటూర్ల వాటికే టౌన్ సర్వీసులు అని తెలిసేలా బోర్డులు పెడితే బాగుంటుంది.
News April 13, 2026
డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.


