News March 20, 2024
నెల్లూరు: రత్నం విద్యాసంస్థల అధినేత మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710927279920-normal-WIFI.webp)
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం అనారోగ్య కారణంగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని వారి నివాసం నందు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.
Similar News
News July 5, 2024
గూడూరు మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720151764301-normal-WIFI.webp)
గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News July 5, 2024
జగన్ పర్యటనతో వైసీపీ ఊపందుకుంది: కాకాణి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162428062-normal-WIFI.webp)
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
News July 5, 2024
దేవదాయ శాఖ మంత్రితో పొంగూరు నారాయణ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720157770947-normal-WIFI.webp)
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.