News April 13, 2024

నెల్లూరు: రూ.లక్ష తర్వాత మద్యం షాపులు మూసివేయాలి

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. మద్యం దుకాణాల్లో రూ.లక్ష విలువగల మద్యం విక్రయం జరగగానే షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ప్రతి వ్యక్తికి ఒక్క మద్యం క్వార్టర్ బాటిళ్లు మాత్రమే అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లు ఇచ్చే వెసులుబాటు ఉండింది. ప్రస్తుతం ఒక్క బాటిల్‌కు మాత్రమే కుదించింది.

Similar News

News October 6, 2025

త్వరలో నెల్లూరుకు రానున్న పవన్..?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్‌లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్‌లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.

News October 6, 2025

ఆ మందు నెల్లూరు జిల్లాలో లేదు: రమేశ్

image

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని Way2News ఫోన్లో సంప్రదించగా.. కోల్డ్రిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

News October 6, 2025

నెల్లూరు: ఇలా చేస్తే ఆటో డ్రైవర్స్ అందరికీ డబ్బులు

image

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిధులు చాలా మంది ఆటో డ్రైవర్స్‌కి రాలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉండి కూడా నిధులు జమకాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దగ్గర్లోని సచివాలయంలో ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తే.. వారు ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. ఆ ఫిర్యాదు నేరుగా రవాణా శాఖకి వెళ్తుంది. వారి అన్నీ పరిశీలించి అర్హత ఉంటే రూ.15 వేలు ఆటో డ్రైవర్స్ అకౌంట్‌లో జమ చేస్తారు.