News February 25, 2026
నెల్లూరు: రెండో రోజు 899 మంది ఆబ్సెంట్.!

నెల్లూరు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్కు తావు లేకుండా పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వరప్రసాద్ రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 27,790 మంది విద్యార్థులకు గాను 26,891 మంది హాజరయ్యారని 899 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 27, 2026
మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News February 27, 2026
నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 27, 2026
నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.


