News November 13, 2024
నెల్లూరు: వందే భారత్ రైలు ఢీకొని మహిళ మృతి

కోవూరు మండలం పడుగుపాడు రైల్వే గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. లేగుంటపాడు గ్రామానికి చెందిన సరోజమ్మ(65) రైల్వే గేటు దాటుతుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
దేశంలో ఎక్కడా లేదు.. శ్రీకాళహస్తిలోనే..!

శ్రీకాళహస్తి క్షేత్రంలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ముఖద్వారం, నందీశ్వరుడు, బలిపీఠంతో పాటు దారు ఏకశిలా ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం పైన చిన్న నంది ఉంటుంది. ఇటువంటి దారు ఏకశిలా ధ్వజస్తంభం భారతదేశంలో మరెక్కడా లేదు.
News February 15, 2026
నెల్లూరు: మల్లెపూలు కాదు.. తెల్లని బంగారమే!

నెల్లూరు జిల్లా కోట మండలంలో మల్లెపూల దిగుబడి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తోటల నుంచి మొగ్గలు రావడం మొదలవ్వడంతో మార్కెట్లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ.1400 పలుకుతోంది. దిగుబడి స్వల్పంగా ఉన్నప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా రైతులు వీటిని తిరుపతి, గూడూరు, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట లేకపోయినా, లభిస్తున్న అధిక ధరతో రైతులు అందినకాడికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
News February 15, 2026
నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.


