News April 15, 2024

నెల్లూరు వద్ద ముగ్గురు శ్రీకాకుళం వాసుల మృతి

image

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు చనిపోయారు. టెక్కలికి చెందిన రామయ్య(44), జలుమూరు(M) నగిరికటకానికి తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వెళ్లారు. ముగ్గురూ కలిసి బైకుపై ఆ జిల్లాలోని పొదలకూరుకు పనికి వెళ్లారు. తిరిగొస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లో చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

Similar News

News October 7, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు

image

శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 7, 2024

జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO

image

శ్రీకాకుళం జిల్లాలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు

News October 7, 2024

ఇసుకను పొందడంలో సమస్యలా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

ఇసుక‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కేటాయించ‌డం జ‌రుగుతోంద‌ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఇసుకను (https://www.sand.ap.gov.in) లో బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక పొంద‌డంలో స‌మ‌స్య‌లు ఎదురైతే, 24 గంట‌లూ ప‌నిచేసే జిల్లా స్థాయి ఫెసిలిటేష‌న్‌ సెంట‌ర్‌ను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 18004256012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చన్నారు.