News July 31, 2024

నెల్లూరు: వేగంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు

image

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 38 స్టేషన్‌లో 309 కి.మీ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేంద్రం ఇచ్చింది. రాష్ట్రం తన వాటా ఇవ్వనుంది. దర్శి, పొదిలి ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ చేశారు. జిల్లాలో వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంటకగిరి మండలాల మీదుగా 15 స్టేషన్‌లలో పనులు సాగునున్నాయి. అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు.

Similar News

News July 7, 2025

నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

image

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 7, 2025

నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

image

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

News July 6, 2025

మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

image

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.