News May 26, 2024
నెల్లూరు: ‘వేమిరెడ్డికి లక్షన్నర మెజార్టీ ఖాయం’

ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి 20వేల మెజార్టీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్షన్నర మెజార్టీతో గెలుస్తున్నారని సీనియర్ నాయకుడు, అనంతసాగరం మండలం పాతాళపల్లి సర్పంచ్ బిజీ వేముల ఓబుల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న టీడీపీ సునామీ సృష్టించబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని చెప్పారు.
Similar News
News February 6, 2026
CMపై అంబటి విమర్శలు.. మౌనంలో నెల్లూరు MPలు, మంత్రులు!

CM చంద్రబాబుపై YCP నేత అంబటి రాంబాబు చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించేందుకు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు వేమిరెడ్డి, బీదలు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి కనీసం స్పందించక పోవడం గమనార్హం. కనీసం ప్రెస్మీట్లలోనూ అంబటి వ్యాఖ్యలపై స్పందించ లేదనేది తెలుస్తోంది. నెల్లూరులో రాజకీయాలు ఎప్పుడు..? ఎలా..? రూటు మారుతాయో తెలియడం లేదు.
News February 6, 2026
నెల్లూరు: మితిమీరుతున్న గంజాయి అరాచకాలు!

గంజాయి పేరు వింటేనే నెల్లూరు జిల్లా ఉలిక్కిపడుతుంది. ఇందుకు నెల్లూరు కల్లూరు పల్లిలో ఉద్యమకారుడి దారుణ హత్య, కోవూరులో మైనర్ బాలికపై హత్యాయత్నం వంటి ఘటనలే ఉదాహరణ. జిల్లాలో ఏదో ఒకచోట నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది. రోడ్లపై కత్తులతో హల్చల్ వంటి ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీటి మూలాలను పూర్తిగా నాశనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News February 6, 2026
తత్కాల్ ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్ను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.


