News August 22, 2024

నెల్లూరు: 48 గంటల్లోనే దొంగలను పట్టుకున్న పోలీసులు

image

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో బంకు నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసులు లాకెళ్లిన ఇద్దరు నిందితులను 48 గంటల్లో సంగం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి K.వేణుగోపాల్ సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వేమారెడ్డి, ఎస్ఐ ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

నెల్లూరు: అధికారులకు డీఆర్వో ఆదేశాలు

image

జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తప్పనిసరిగా 144 సెక్షన్ అమలు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని సూచించారు.

News February 16, 2026

నెల్లూరు జిల్లా ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పానల్ జాబితాలను తయారు చేయాలని సూచించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్, శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని సూచించారు.

News February 16, 2026

నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

image

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.