News April 12, 2025
నెల్లూరు: KGBVలో ప్రవేశాలకు గడువు పెంపు

నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాల గడువు పొడిగించినట్లు జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. KGBVలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడి బయట పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే అర్హులన్నారు.
Similar News
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.
News April 20, 2025
నెల్లూరులో 647 టీచర్ పోస్టులు

డీఎస్సీ-2025 ద్వారా నెల్లూరు జిల్లాలో 647 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:18 ➤ ఇంగ్లిష్: 84
➤ గణితం: 63 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 103
➤ పీఈటీ: 107 ➤ఎస్జీటీ: 115 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్ఏ హిందీ 1, ఇంగ్లిష్ 1, మ్యాథ్స్ 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.