News October 2, 2025
నెల్లూరు: NMC లో చందాలు..!

NMC లో దసరా చందాకు తెరలేపారు. ప్రజారోగ్య విభాగంలో కొంతమంది విజిలెన్స్ అధికారుల పేరు చెప్పి సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు సమాచారం. శానిటరీ సూపర్వైజర్లు దందా చేసినట్లు తెలిసింది. ట్రేడ్ లైసెన్స్లు వ్యవహారం అంటూ.. అధికారుల పేరు చెప్పడంతో కార్యదర్సులు చందాను ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేలు వరకు వసూలు చేశారని కొంతమంది వాపోతున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Similar News
News October 2, 2025
పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ లో పాల్గొన్న ఎస్పీ

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆయుధాలకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కనకదుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.
News October 2, 2025
నెల్లూరు: అనుమతులు లేకుండానే ఆక్వా సాగు!

ప్రభుత్వ భూముల్లో అనుమతి పత్రాలు లేకుండా 12,734 మంది రైతులు 16,836.84 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రెవెన్యూ నుంచి NOC లేకుండా ఈతంతు సాగుతోంది. రీసర్వే జరగని కారణంగా 8678.56 ఎకరాలకు చెందిన 4174 మంది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి LPM నంబర్లు తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఈనెల 20వ తేదీలోగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్లు పొందాలని ఫిషరీస్ JD శాంతి తెలిపారు. దీంతో విద్యుత్ రాయితీలు పొందవచ్చన్నారు.
News October 2, 2025
నెల్లూరు: రొయ్య రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు!

అమెరికా టారిఫ్స్ తో జిల్లాలో కుదేలైన అక్వా రంగంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రొయ్య సాగు రైతుల్లో ఏర్పడిన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రొయ్యల ఎగుమతుల ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10% ఉన్న రష్యా ఆర్డర్ 40% పెరిగిందని సమాచారం. తాజాగా యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం కూడా రైతులలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఎగుమతిదారులు చెబుతున్నారు.