News June 23, 2024

నేటితో ముగియనున్న ఐటీఐ కౌన్సిలింగ్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఐదో రోజు శనివారం 432 మంది విద్యార్థులను పిలవగా 211 మంది హాజరయ్యారు. వారిలో 98 మందికి వివిధ కళాశాలలో సీట్లు లభించింది. ఆఖరి రోజు 2,306 ర్యాంకు నుంచి 2,470 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News October 5, 2024

శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత

image

అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

News October 5, 2024

శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

image

శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.

News October 5, 2024

శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

image

దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.