News August 19, 2024

నేటి నుంచి ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ 

image

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి చివరి విడత కౌన్సెలింగ్  షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. 23న ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చు. 26న అలాట్మెంట్లను ప్రకటిస్తారు. 30 లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.

Similar News

News November 5, 2025

శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

image

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

నేడు శ్రీకాకుళం జిల్లా సమీక్ష సమావేశం: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ప్రవాస భారతీయుల సాధికారత సంబంధాల శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుందన్నారు. అజెండాలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నట్లు వివరించారు.

News November 4, 2025

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.