News September 30, 2024
నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
Similar News
News February 1, 2026
MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 1, 2026
మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.
News February 1, 2026
మెదక్: ఆపరేషన్ స్మైల్.. 81 మంది SAFE

జిల్లాలో జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 81 మంది బాలలను రక్షించి, 69 మందిని తల్లిదండ్రులకు అప్పగించి, 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 6 పాఠశాలలో ప్రవేశం కల్పించడం అభినందనీయమన్నారు.


