News July 1, 2024

నేటి నుంచి కొత్త చట్టాలు.. సిద్ధమైన పోలీస్ యంత్రాంగం

image

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన చట్టాల అమలుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. నెల రోజులుగా 14 బ్యాచ్లుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయటంతో పాటు తీర్పులు వెలువడనున్నాయి.

Similar News

News September 21, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలో నూతన పోలీస్ స్టేషన్‌లకు కసరత్తులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జనాభా, పరిపాలన సులభతరం కావడానికి గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన జిల్లా ఎస్పీ జానకి ప్రభుత్వానికి పంపించామని శుక్రవారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో 3వ టౌన్, జడ్చర్లలో సబ్ డివిజన్ కార్యాలయం, ట్రాఫిక్ రూరల్ పోలీస్ స్టేషన్, కౌకుంట్లలో నూతన భవనాలకు నివేదికను ఇచ్చామన్నారు.

News September 21, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో ఉదయం నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేయగా రాత్రి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 7,849 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 11,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News September 21, 2024

SDNR: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

image

భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడినట్లు షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామపంచాయతీలోని గుండ్యా తండాకు చెందిన జటావత్ రమేశ్ చెడు వ్యసనాలకు అలవాటు పడి భార్య లలిత(30)ను 2020 అక్టోబర్ 26న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు రమేశ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.