News December 31, 2025

నేటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన

image

AP: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లలో నేటి నుంచే పాలనా వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. కొత్త కలెక్టర్లు, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్‌ఛార్జులుగా కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. కాగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.

Similar News

News December 31, 2025

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన indices అంతకంతకూ పెరుగుతూ ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 429 పాయింట్ల లాభంతో 85,104 వద్ద.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 26,092 దగ్గర ట్రేడవుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ట్రెంట్, టైటాన్ షేర్లు లాభాల్లో.. TCS, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News December 31, 2025

2025: ESPN వన్డే, టీ20, టెస్ట్ టీమ్స్ ఇవే

image

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో టెస్ట్, వన్డే, టీ20 టీమ్స్‌ను ESPNCRICINFO ప్రకటించింది. టెస్టుల్లో భారత్ నుంచి రాహుల్, గిల్, జడేజా, సిరాజ్, వన్డేల్లో రోహిత్, కోహ్లీ, టీ20ల్లో అభిషేక్, వరుణ్, బుమ్రాను ఎంపిక చేసింది. వన్డేలకు రోహిత్, టెస్టులకు బవుమా, టీ20లకు పూరన్‌కు కెప్టెన్‌గా సెలక్ట్ చేసింది. అటు వన్డే, T20ల్లో మహిళా టీమ్స్‌నూ ప్రకటించింది. పూర్తి టీమ్స్ కోసం పైన స్వైప్ చేయండి.

News December 31, 2025

తలరాతను మార్చిన చదువు.. తల్లిదండ్రులకు అద్భుత బహుమతి

image

మహారాష్ట్రలో గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి IPS ఆఫీసర్ అయిన బర్దేవ్ సిద్ధప్ప గుర్తున్నారా? ఇల్లు కూడా లేని ఆయన బీటెక్ పూర్తి చేసి 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో IPSగా ఎంపికయ్యారు. ఆ కమ్యూనిటీ నుంచి IPS అయిన తొలి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను, ఆత్మీయులను విమానం ఎక్కించారు. విమానం గురించి చిన్నప్పుడు కలలు కనేవాడినని, ఇప్పుడు నిజమైందని సిద్ధప్ప ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.