News March 17, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. వీటిని గమనించండి

తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం అయ్యే టెన్త్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 164 మంది చీఫ్లు, 1,574 ఇన్విజిలేటర్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని పరీక్షల కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Similar News
News July 9, 2025
భారత నేవీలో 1,040 పోస్టులు

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <
News July 9, 2025
నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.
News July 9, 2025
ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.