News October 10, 2025
నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునః ప్రారంభం

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ మూర్తి తెలిపారు. ఈనెల 2 నుంచి 9 వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని పురస్కరించుకుని ఈ 8 రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో వీటిని పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.
Similar News
News October 10, 2025
జడ్చర్ల: వృద్ధ దంపతులను రక్షించేందుకు అధికారుల చర్యలు

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబఠాపూర్ ఆమ్లెట్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు వాగు దాటే సమయంలో గల్లంతైన విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింగ్ రావు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
News October 10, 2025
NGKL: ఎన్నికలు వాయిదా.. అయోమయంలో నాయకులు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నామినేషన్లు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పిటిసి, 115 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అంతలోనే ఎన్నికలు వాయిదా పడడంతో నేతలు కంగు తిన్నారు.
News October 10, 2025
MBNR: ఎన్నికలు వాయిదా ఆశావహుల ఆశలు ఆవిరి

ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆశావహుల్లో ఆశలు ఆవిరి అయ్యాయి. మళ్లీ షెడ్యూల్ వస్తే ఇప్పుడు ఖరారైన రిజర్వేషన్లు ఉంటాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు వాయిదా పడటంతో మరి కొందరు ఆనందంలో ఉన్నారు. తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తుందో.. రాదోనని అయోమయంలో పడ్డారు.