News March 6, 2025
నేటి నుంచి 10 విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు

పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 6న తెలుగు, 7న హిందీ, 10న ఇంగ్లీష్, 11న గణితం, 12న భౌతిక, రసాయన శాస్త్రం, 13న జీవ శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ప్రశ్నాపత్రాలను ఎమ్మార్సీ కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
పార్వతీపురం:‘తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి’

వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
News March 6, 2025
సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?
News March 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్లో 21156 మంది, ఒకేషనల్లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.