News August 25, 2025

నేటి నుంచే కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

image

కడప జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్యుమెంట్ల పరిశీలన చేయనున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం హాల్ టికెట్ నెం.4001160 నుంచి 4206930 అభ్యర్థుల డాక్యుమెంట్ల పరిశీలిస్తారు. మంగళవారం హాల్ టికెట్ నెం.4214369 నుంచి 4504062 అభ్యర్థుల వివరాలు క్రాస్ చెక్ చేస్తారు.

Similar News

News August 25, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌కు ఆర్థికసాయం

image

TG: ‘పుష్ప-2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ‘మిషన్ వాత్సల్య పథకం’ కింద బాలుడికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.4,000 అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గడచిన 3 నెలలకుగాను రూ.12వేలు వారి ఖాతాలో జమ చేసింది. కాగా ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోగా, గాయపడిన శ్రీతేజ్ ఇంకా కోలుకుంటున్నాడు.

News August 25, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు అరెస్ట్

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులపై జిల్లా పోలీసులు దృష్టిపెట్టారు. అతని ప్రధాన అనుచరులు జగదీశ్‌తో పాటు భూపతి, సురేంద్రను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గ్యాంగ్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

News August 25, 2025

కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్: NZB ఎంపీ

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సోమవారం నిజామాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.