News September 10, 2025
నేడు అనంతపురానికి CM చంద్రబాబు

★ నేడు మ.12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో అనంతపురం బయలుదేరుతారు
★ మ.1.30కి అనంతపురం చేరుకుంటారు
★ అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక ఉండవల్లికి తిరుగుపయనం
▶ అనంతపురానికి సీఎం, డిప్యూటీ సీఎం, కూటమి ఎమ్మెల్యేలందరూ వస్తుండటంతో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News September 10, 2025
ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా?

AP: 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సభలోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్, కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూళ్లు పున ప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరతారని సమాచారం.
News September 10, 2025
తాండూర్: బిర్యానీలో బొద్దింక.. 25 వేలు జరిమానా

తాండూర్లోని శ్రీ దుర్గా గ్యాండర్ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం చికెన్ బిర్యాని తినే సమయంలో కస్టమర్కు బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో మున్సిపల్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్ను తనిఖీ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు.
News September 10, 2025
అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.