News October 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో స్కూల్స్కు సెలవు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కాటాబత్తిన సుబ్రహ్మణ్యం తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News October 22, 2025
గద్వాల్: రోడ్డు కనెక్టివిటీకి అడుగులు..!

గద్వాల జిల్లా పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ.316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ➤ ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్ రూ.9.61 కోట్లు ➤ గద్వాల-జమ్మిచేడు, పూడూరు x రోడ్, పుటాన్పల్లి, ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు ➤ గద్వాల రాయచూర్ రూ.74.29 కోట్లు ➤ గద్వాల-అయిజ రూ.24.32కోట్లు ➤ బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు ➤ గట్టు మాచర్ల రోడ్డు రూ.12.80 కోట్లు మంజూరయ్యాయి.
News October 22, 2025
తుని ఘటనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్

తుని మండలంలోని ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి సహాయం అందిస్తామని, హాస్టళ్లలో బాలికలకు భద్రత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.
News October 22, 2025
UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

పండుగ సీజన్లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.


