News March 16, 2025
నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 1901లో మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ హరిజనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టిరాములు.
Similar News
News February 20, 2026
నెల్లూరు: 5రోజుల్లోనే రైతులకు డబ్బుల జమ

నెల్లూరు జిల్లాలో శనగ పంటను క్వింటాల్కు ₹5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామని, విక్రయించిన 5 రోజుల్లోనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8978381839 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.
News February 20, 2026
నెల్లూరు వాసికి కీలక పదవి

నెల్లూరుకు చెందిన ఆడిటర్ ముప్పాల సుబ్బారావుకు కీలక పదవి లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సౌత్ రీజినల్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. త్వరలో ఆయనకు నెల్లూరులో సన్మానం చేస్తామని అడ్వకేట్ పర్వేజ్ ప్రకటించారు.
News February 20, 2026
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.


