News March 16, 2025

నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

image

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 1901లో మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ హరిజనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టిరాములు.

Similar News

News March 17, 2025

నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.

News March 17, 2025

పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.5కోట్లు దోచేశారు

image

నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నెల రోజుల్లో దాదాపు రూ.5కోట్లు దోచేసినట్లు సమాచారం. డాక్టర్లు, ఆడిటర్లు, రిటైర్డ్ టీచర్లే లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ భయపెడుతూ యథేచ్చగా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల CBI అధికారినంటూ ఓ వ్యక్తి వద్ద కోటికి పైగా దోచేసిన విషయం తెలసిందే. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News March 17, 2025

నెల్లూరు : 174 కేంద్రాలు…33,434 మంది విద్యార్ధులు

image

నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO బాలాజీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 174 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,434 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ‌విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందు రావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్ష బాగా రాయాలన్నారు.

error: Content is protected !!