News January 19, 2025

నేడు అమిత్ షా ప్రారంభించనున్న NIDM పూర్తి వివరాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(NIDM) దక్షిణ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకురాగా 2015లో గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన ఈ కేంద్ర సంస్థ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోగా నేడు మంత్రి అమిత్‌షా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

Similar News

News February 27, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు: కృష్ణా SP
* ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను పరామర్శించిన లక్ష్మీపార్వతి
* ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదని పేరెంట్స్ ఆవేదన
* మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన పోలీసులు
* CRDA కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
* బాపులపాడు డిప్యూటీ MPDOపై సస్పెన్షన్ వేటు
* గన్నవరం ఎయిర్పోర్ట్‌లో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

News February 27, 2026

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు: కృష్ణా ఎస్పీ

image

న్యాయవ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం
ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. ఇటీవల సైబర్ నేరగాళ్ల చెర నుంచి పోలీసుల సాయంతో బయటపడ్డ వృద్ధ దంపతులను అభినందించారు. జిల్లావ్యాప్తంగా దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

News February 27, 2026

ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

image

ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.