News February 19, 2025

నేడు ఏలూరు జిల్లాలో జర్మన్ ప్రతినిధుల పర్యటన

image

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏలూరు, కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో పర్యటిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు. ఇక్కడి సాగు వివరాలను తెలుసుకుంటారు.

Similar News

News July 5, 2025

సంగారెడ్డి జిల్లాకు 19 ప్రభుత్వ పాఠశాలలు మంజూరు

image

సంగారెడ్డి జిల్లాకు నూతనంగా 19 ప్రభుత్వ పాఠశాలలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జహీరాబాద్ మండలానికి 10, సంగారెడ్డి మండలానికి 4, రామచంద్రపురం మండలానికి 4, సదాశివపేట మండలానికి ఒక పాఠశాల మంజూరైనట్లు వెల్లడించారు.

News July 5, 2025

తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

image

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News July 5, 2025

విశాఖలో బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.