News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News December 10, 2025
HYDలో నైట్ లైఫ్కు కేఫ్ కల్చర్ కిక్

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్టాప్లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్స్పాట్లు ఉంటాయి. వైన్-డైన్కు బదులు కాఫీ, ఫుడ్తో యూత్ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.
News December 10, 2025
ఓయూకు రూ.1000 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ CM రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు. క్యాంపస్లో మౌలిక వసతులు, మెరుగైన విద్య, నూతన భవనాల నిర్మాణాలు, విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని <<18476536>>CM<<>> పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడొద్దనేది తన సంకల్పం అన్నారు.
News December 10, 2025
మహానగరంలో ‘మహాలక్ష్మి’కి పెరుగుతున్న ఆదరణ

మహానగరంలో మహాలక్ష్మి పథకానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించిన అనంతరం బస్సులు రద్దీగా మారాయి. సరిగ్గా 2ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నగరంలో 118 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని.. ఈ మేరకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు.


