News April 10, 2025
నేడు కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Similar News
News April 18, 2025
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.
News April 18, 2025
కర్నూలు: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై జేసీ ఆదేశాలు

ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కర్నూలు జేసీ డా.బి.నవ్య అధికారులకు ఆదేశించారు. గురువారం టెలి కాన్ఫరెన్స్లో భాగంగా ఎలెక్ట్రానిక్ వెస్ట్ కలెక్షన్, వాట్సాప్ గవర్ననెన్స్పై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు. రెడ్యూస్ రీసైకిల్ & రీయూస్ సెంటర్లను ఏర్పాటుచేసి, మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు.
News April 17, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ ఆదోనిలో 19న జాబ్మేళా➤ మంత్రాలయం: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య➤ సీజ్ ద గోడౌన్: ఎంపీ శబరి➤ ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్➤ హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి: జిల్లా ఎస్పీ➤ కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి➤ కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్లైన్ దరఖాస్తులు➤ ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి అవసరం:డీఐజీ➤ కర్నూలుకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి