News June 28, 2024

నేడు కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం

image

మాల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రీష్మ రుతువులో వేసవి తాపం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం చేస్తామని అర్చకులు కపిందర్ పేర్కొన్నారు.

Similar News

News July 1, 2024

సిరిసిల్ల: కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. వ్యక్తి అరెస్టు

image

కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇసుక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ ప్రకారం.. రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురుబాబు(30) అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపి చెరువులోకి తోసివేశాడు. కాగా, ఆ సమయంలో ట్రాక్టర్‌పై కానిస్టేబుల్ సత్యనారాయణ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి.

News July 1, 2024

జగిత్యాల: నేటి నుంచి నూతన చట్టాలు అమలు

image

నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

News July 1, 2024

KNR స్మార్ట్‌సిటీ పనుల పూర్తికి అవకాశం

image

స్మార్ట్‌సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్‌ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.