News March 8, 2025
నేడు కొత్తగూడెం కోర్టులో లోక్ అదాలత్

ఈనెల 8వ తేదీన (శనివారం) కొత్తగూడెం కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వారి మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఎటువంటి కేసులు ఉన్నా రాజీ కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని సూచించారు.
Similar News
News December 21, 2025
పాలకుర్తి: 111 ఏళ్ల వృద్ధురాలు మృతి

పాలకుర్తి మండలం బక్కరాజంపల్లికి చెందిన జాడి చంద్రమ్మ(111) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందింది. చంద్రమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్ళు ఉండగా కుమారులు ముగ్గురు ఆమె కళ్ళముందే పలు కారణాలతో మృతి చెందారు. వీరందరికీ 16 మంది సంతానం ఉన్నారు. తమ ఊరిలో ఎక్కువ కాలం బ్రతికింది ఒక్క చంద్రమ్మేనని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు చంద్రమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు.
News December 21, 2025
మచిలీపట్నం-అజ్మీర్ స్పెషల్ ట్రైన్ ప్రారంభం

మచిలీపట్నం-అజ్మీర్ ప్రత్యేక రైలును ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆదివారం ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఆయన తనయుడు పునీత్ ఇనగుదురుపేట జెండా సెంటర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చాదర్ను ర్యాలీగా రైల్వే స్టేషన్కు తీసుకువచ్చి అజ్మీర్కు పంపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
News December 21, 2025
బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర నిరసన.. క్లారిటీ ఇచ్చిన ఇండియా

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర జరిగిన నిరసనలపై ఇండియా క్లారిటీ ఇచ్చింది. <<18624742>>దీపూ చంద్రదాస్<<>> హత్యను నిరసిస్తూ, బంగ్లాలో మైనారిటీల రక్షణ కోసం అక్కడ కొంతమంది నినదించారని విదేశాంగశాఖ తెలిపింది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. బంగ్లా మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంది. బంగ్లాలో మైనారిటీలపై దాడుల పట్ల ఇండియా తన ఆందోళనను అక్కడి అధికారులకు తెలియజేసింది.


