News September 5, 2025

నేడు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనానికి సీఎం

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉ.10 గం.కు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ కూడా రానున్నారు. కాగా, మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరుతుండటంతో పందిరి తొలగింపు, టస్కర్ ఏర్పాట్ల నేపథ్యంలో నిర్వాహకులు భక్తులను అనుమతించడంలేదు.

Similar News

News September 7, 2025

విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

image

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్‌ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

News September 7, 2025

పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

image

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.

News September 7, 2025

గద్వాల: కృష్ణా నదిలో బాలుడి గాలింపు

image

గద్వాల(M) రేకులపల్లి వద్ద కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు గల్లంతయ్యారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చంద్రశేఖర్(13), అతని స్నేహితుడు కృష్ణతో కలిసి చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లారు. రాత్రి కావడంతో వారు పుట్టిలో నిద్రిస్తుండగా, నదిలో ప్రవాహం పెరిగి పుట్టి కొట్టుకుపోయింది. కృష్ణకు ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నారు.