News January 24, 2025
నేడు గద్వాలకు మల్లు రవి

గద్వాల జిల్లాకు నేడు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రానున్నట్లు కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మన్ నల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో అమృత్ 2.0 తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మల్లు రవితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.
Similar News
News November 12, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు కారణాలు తెలియరాలేదు.
News November 12, 2025
పాలమూరు అగ్రో డైరెక్టర్ రమేష్ రెడ్డి అరెస్ట్

పాలమూరు అగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేష్ రెడ్డిని ఎస్ఎఫ్ఐఓ అధికారులు అరెస్టు చేశారు. ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ పత్రాలతో సంస్థకు చెందిన రూ.300 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టు వారెంట్ జారీ చేయడంతో, ఆయన్ను అధికారులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.
News November 12, 2025
NGKL: ‘దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలి’

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు కృషి చేయాలని నోడల్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ అన్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


