News December 23, 2025

నేడు గద్వాల్, వనపర్తి జిల్లాలో గవర్నర్‌ పర్యటన

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈరోజు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. అలంపూర్‌ జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గద్వాల కలెక్టరేట్‌లో చేనేత స్టాళ్లను పరిశీలిస్తారు. వనపర్తి కలెక్టరేట్‌లో అభివృద్ధి పథకాల స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు జిల్లాలకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు, జాతీయ స్థాయి ప్రతిభావంతులతో గవర్నర్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Similar News

News December 23, 2025

HYD: నేడో, రేపో డీ లిమిటేషన్ ఫైనల్

image

GHMCని 300 వార్డులుగా పునర్విభజన చేస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను GHMC యంత్రాంగం పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేసింది. దీనికి అనుగుణంగా ఫైనల్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఆమోదంతో నేడో, రేపో వెలువడే అవకాశం ఉంది. కాగా, కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి అధికారులు పంపించారు.

News December 23, 2025

మేడారం: ఇంకా 36 రోజులే.. SLOWగా పనులు..!

image

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సాధారణంగా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. కాగా, జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మక్క మాల ధరించి మరీ అధికారులుందరూ ఇక్కడే ఉండి జాతర పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా అలాంటి పరిస్థితేమీ కన్పించట్లేదు.

News December 23, 2025

TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

image

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.