News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Similar News

News February 16, 2026

మున్సిపోల్స్: మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

image

TG: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. <<19147238>>కరీంనగర్ మినహా<<>> మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.

News February 16, 2026

రూ.10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు: మృణాల్

image

యాక్టర్‌గా ఉండటమంటే సన్యాసిగా జీవించడం లాంటిదేనని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. తిండి, నిద్ర వదులుకోవాలని, ఫోకస్డ్‌గా ఉండాలని చెప్పారు. ‘నాకు PR టీమ్ లేదు. <<19123301>>నాపై వచ్చిన<<>> రూమర్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె నటించిన ‘దీ దీవానే సెహర్‌ మే’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.

News February 16, 2026

పాక్‌పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

image

T20 WCలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్‌తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్‌ను మన జట్టు ఓడించింది.