News September 6, 2025
నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి.. రంగంలోకి పోలీసు బలగాలు

తాడిపత్రిలో నేడు జిల్లా SP జగదీశ్ పర్యటించనున్నారు. మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు బలగాలతో ఎస్పీ జగదీశ్ బయలుదేరారు. ఎవరైనా అల్లరి సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Similar News
News September 6, 2025
BHPL: యువకుడిని కిడ్నాప్ చేసి హత్య

యుడకుడిని కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన <<17625671>>BHPL<<>> జిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. BHPLకి చెందిన బాసిత్(21) మూడు రోజుల క్రితం కిడ్నాప్ ఐనట్లు తల్లి సబియా ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పలువురు తన కొడుకును హత్య చేశారని ఆరోపించింది. మేడారం సమీప అడవుల్లో మృతదేహం లభించింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన మెసేజ్ల వల్లే గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
News September 6, 2025
కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 6, 2025
సంగారెడ్డి: జీపీవో నియామక పత్రాలు అందజేత

సంగారెడ్డి జిల్లా నుంచి ఎంపికైన జీపీవోలకు శుక్రవారం హైదరబాద్లోని మాదాపూర్ హైటెక్స్లో నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. సంగారెడ్డి జిల్లా నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు బస్సులను ఏర్పాటు చేసి వారిని హైదారాబాద్ తీసుకువెళ్లారు. నియామక పత్రాలు అందుకున్న వారికి త్వరలో పోస్టింగ్ కొరకు కౌన్సెలింగ్ ఉండనుంది.