News June 28, 2024
నేడు తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల

గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి సాగునీటిని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేయనున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర అధికారులు పాల్గొనున్నారు.
Similar News
News November 12, 2025
ప్రతీ మండలంలో వెయ్యి మందికి ఉపాధి పనులు: VZM కలెక్టర్

జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉపాధి పనులపై జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన డ్వామా, ఏపీడీలు, MPDOలు, ఏపీవోలతో మండలాల వారీగా సమీక్షించారు. మెంటాడ, రామభద్రపురం, సంతకవిటి, రాజాం, కొత్తవలస, భోగాపురం, గుర్ల మండలాలు పనిదినాల కల్పనలో వెనుకబడ్డాయని, 1000 మంది శ్రామికులకు పని కల్పించాలన్నారు.
News November 12, 2025
VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.
News November 12, 2025
VZM: నేడు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపింది.


