News April 1, 2025
నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు అందించే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30గంటలకు HYD చేరుకుంటారు.
Similar News
News September 12, 2025
నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.
News September 12, 2025
NLG: ఆర్టీసీలో యాత్రాదానం

యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, NRIలు, సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
News September 12, 2025
NLG: కుక్క పిల్లల దత్తతకు స్పందన భేష్!

నల్గొండ పట్టణంలో కుక్క పిల్లల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. దత్తత ఇచ్చేందుకు 30 కుక్క పిల్లలను గుర్తించారు. దత్తత తీసుకోవడానికి 25 మంది ముందుకు వచ్చారు. కుక్క పిల్లలు దత్తత తీసుకున్న వారు వాటి బాగోగులు చూసుకోవడంతో పాటు సంతానరహిత ఆపరేషన్లు చేయించనున్నారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది దత్తత కోసం వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.