News July 5, 2024

నేడు నల్లమలలో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటన

image

అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పర్ణిక రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం గుర్తించిన అక్కమాంబ గుహలు, కదిలి వనం, అక్టోపాస్ వ్యూ పాయింట్, టూరిజం స్పాట్లను సందర్శించానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News December 17, 2025

MBNR:‘ఇన్నోవేషన్ పంచాయత్’.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా!

image

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీజీఐసీ ) తెలంగాణలోని ఆవిష్కర్తలను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.https://forms.gle/Av75xS4UUGRNKLpx8 ఫార్మ్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT.

News December 17, 2025

MBNR: ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..UPDATE

image

మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
✒133 రిటర్నింగ్ అధికారులు,13 రిజర్వ్ తో కలిపి మొత్తం 146 మంది రిటర్నింగ్ అధికారులు
✒1152 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ తో కలిపి 1551 బ్యాలెట్ బాక్స్ లు
✒28 జోన్లకు రిజర్వ్ తో కలిపి 32 మంది జోనల్ అధికారులు
✒20 శాతం రిజర్వ్ తో కలిపి 3005 మంది పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు
✒పి.ఓ.లు 2310, ఓ.పి. ఓ.లు 3386 మంది అందుబాటులో ఉన్నారు.

News December 17, 2025

ALERT..వీడియో గ్రఫీ,వెబ్‌ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని విసి కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి మూడో విడత ఎన్నికలు జరుగనున్న బాలానగర్ ,జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్, అడ్డాకల్ మండలాల అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు.