News February 24, 2026
నేడు నాగర్కర్నూల్లో టెన్షన్.. టెన్షన్..!

కుమ్మెర ఘటన నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే BRS, CPM, BSP, TRP, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, MRPS, బీసీ సంఘాల నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అయితే 8 మంది నిందితుల్లో ముగ్గురినే పోలీసులు అరెస్ట్ చేశారని వారంటున్నారు. కాగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్న కాంగ్రెస్ జిల్లా చీఫ్, MLA వంశీకృష్ణ తెలిపారు. నేడు BJP స్టేట్ చీఫ్ రాంచందర్రావు NGKLకు రానుండగా టెన్షన్ నెలకొంది.
Similar News
News February 25, 2026
రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న KTR

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News February 25, 2026
YELLOW ALERT: రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.
News February 25, 2026
ఇంటర్మీడియట్ పరీక్షలపై కలెక్టర్–ఎస్పీ సంయుక్త పర్యవేక్షణ

గద్వాల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. ఈ నేపథ్యంలో గద్వాల్ పట్టణంలోని జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.


