News July 7, 2025

నేడు భద్రాద్రి జిల్లాలో తుమ్మల పర్యటన

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అశ్వాపురం మండలం బి.జి. కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

Similar News

News July 7, 2025

10న మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్

image

కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి మీటింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.

News July 7, 2025

ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

image

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

News July 7, 2025

రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 35 అర్జీలు

image

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 35 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, దొంగతనం కేసులు, ఇతర కేసులకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.