News January 15, 2026
నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.
Similar News
News February 16, 2026
మంత్రి లోకేశ్తో కలసి క్రికెట్ చూసిన ఎంపీ సానా

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరుకు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రాజ్యసభ సభ్యుడు, ACA కార్యదర్శి సానా సతీశ్ బాబు ప్రత్యక్షంగా వీక్షించారు. గ్యాలరీలో భారత జెండా ఊపుతూ జట్టు విజయాన్ని వీరు మనస్ఫూరంగా ఆస్వాదించారు.
News February 16, 2026
సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది?

గర్భాశయ ముఖద్వారం(Cervical Cervix)లోని కణాలకు సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) ఇది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు-లైంగిక చర్య, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు కావడం ఈ క్యాన్సర్కు ప్రధాన కారణాలు. లైంగిక సంబంధాలతోనూ వ్యాపిస్తుంది. వంశపారపర్యం వల్ల రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత క్యాన్సర్ బయటపడుతుంది. అందుకే TG ప్రభుత్వం అమ్మాయిలకు ముందస్తుగా <<19154216>>వ్యాక్సిన్<<>> ఇవ్వనుంది.
News February 16, 2026
చెర్వుగట్టుకు పోటెత్తారు

మహాశివరాత్రి కావడంతో చెర్వుగట్టుకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తోపులాటలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.


