News April 15, 2025

నేడు మొబైల్ రికవరీ మేళా: ఎస్పీ

image

కడప జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను బాధితులకు అందజేసేందుకు ఈ రోజు మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులు సరైన రికార్డులు తీసుకుని వస్తే మొబైల్స్ అందజేస్తామన్నారు

Similar News

News April 17, 2025

కడప: 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య?

image

కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాశ్‌కు చెందిన సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కి వెళ్ళి చొక్కా గ్రిల్‌కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 17, 2025

మైదుకూరులో రోడ్డు ప్రమాదం

image

కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆది రెడ్డి పల్లె గ్రామ శివార్లలో ఓ బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2025

అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు: కడప కలెక్టర్

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!