News March 10, 2025
నేడు యాదాద్రికి రానున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి విచ్చేసి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
Similar News
News March 10, 2025
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
News March 10, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 103 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు సెట్ నంబర్ 2 ప్రశ్నాపత్రాలను వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6,339 మంది విద్యార్థులకు గానూ 6,236 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.