News April 15, 2025

నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.

Similar News

News April 16, 2025

కృష్ణా: మొక్కల పెంపకానికి సన్నద్ధం కావాలి – కలెక్టర్

image

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకం కంటే మించిన గొప్ప పనేదిలేదని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువుల గట్ల పైన మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు.

News April 16, 2025

గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న 16వ ఆర్థిక సంఘం 

image

గన్నవరం విమానాశ్రయానికి పనగారియ నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.

News April 16, 2025

కృష్ణా: అంతరించిపోతున్న ఈత బుట్టలు.!

image

ఓ కాలంలో ప్రతిష్ఠగా నిలిచిన ఈత బుట్టలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, సుంకొల్లు, పామర్రు, గన్నవరం, బాపులపాడు తదితర ప్రాంతాల్లో తయారయ్యేవి. ఈత చెట్ల చువ్వలు కోసి, వాటిని చేతితో నేసి అందంగా తయారు చేసేవారు. పట్టణాల్లోకి వెళ్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక ఈ కళ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. 

error: Content is protected !!