News March 26, 2025
నేడు విజయవాడకు వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గురునానక్ కాలనీలోని NAC కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అనంతరం జగన్ వైసీపీ ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు.
Similar News
News November 3, 2025
‘భారీ, మధ్యతరహా వస్త్ర పరిశ్రమలను ప్రోత్సహించండి’

జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఔత్సాహిక వస్త్ర టెక్స్టైల్ పారిశ్రామికవేత్తలకు సంబంధిత అధికారులు ప్రోత్సాహం అందించాలన్నారు. పరిశ్రమలకు భూములు కావలసినవారు ఈనెల 7న ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో నిర్వహించే రోడ్ షోకు హాజరుకావాలన్నారు. ఏపీఐఐసీ, జోనల్, జనరల్ మేనేజర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్కు పాక్కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్కు పాకిస్థాన్కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు.
News November 3, 2025
క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు కలెక్టర్ ఆదేశాలు

యువతలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించి, మండలాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా అధికారులతో సోమవారం సమావేశం జరిగింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని, యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించేలా, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా చూడాలన్నారు.


