News April 5, 2025

నేడు విజయవాడలో “ఆర్ట్ ఫన్ డే” కార్యశాల

image

విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(SPA)లో శనివారం “ఆర్ట్ ఫన్ డే” పేరుతో కార్యశాల జరగనుంది. ఉదయం 10 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చిత్రకళలో నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని, SPA సంస్థ, ఏపీ అటవీ శాఖ తదితరుల సౌజన్యంతో ఈ కార్యశాల జరుపుతున్నామన్నారు. 

Similar News

News December 22, 2025

UPDATE: 9 నెలల బాబు విక్రయం కేసులో ఐదుగురి అరెస్ట్

image

NZBలో 9 నెలల బాబును విక్రయించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లుNZB వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ బాబును విక్రయించారు. వారిద్దరితో పాటు మధ్యవర్తులుగా ఉండి బాబును విక్రయించిన రెహనా బేగం, సర్ తాజ్ అన్సారీ తో పాటు కొనుగోలు చేసిన సలావుద్దీన్ ఖురేషీని అరెస్ట్ చేశామన్నారు.

News December 22, 2025

మహబూబ్‌నగర్: నేడు జిల్లాకు ఐదుగురు మంత్రుల రాక

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, జి.వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్పనపల్లిలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందుల పంపిణీని ప్రారంభించనున్నారు. అనంతరం పిల్లలమర్రి సమీపంలో ఉన్న ఎండీసీఏ గ్రౌండ్‌లో ‘కాకా స్మారక క్రికెట్ టోర్నీ’ని మంత్రులు ప్రారంభించనున్నారు.

News December 22, 2025

బాపట్ల: కోడి గుడ్డు ధరకు రెక్కలు..!

image

తక్కువ ధరకు లభించే పౌష్టికాహారమైన కోడిగుడ్ల ధర ఆకాశాన్నంటింది. మేదరమెట్లలో కోడిగుడ్ల ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.8కి విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్డు ఏకంగా రూ.15 పలుకుతోంది. దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైతులు ఫారాలను మూసివేస్తుండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.